తగ్గేదేలే..' ఇది 'పుష్ప'లో అల్లు అర్జున్‌ చెప్పే డైలాగ్‌. అయితే ఇది బన్నీతోపాటు ఆ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కి బాగా సరిపోతుంది.


బన్నీ యాటిట్యూడ్‌కి ఎంతగా యాప్ట్‌ అనిపించిందో, మైత్రీ మూవీ మేకర్స్‌ రిలీజ్‌ ప్లాన్స్‌కి కూడా ఆ డైలాగ్‌ అంతే యాప్ట్‌ అవుతుంది. కావాలంటే మీరే చూడండి. ఈ ఏడాది ఆఖరు, వచ్చే ఏడాది ప్రారంభంలో మొత్తంగా వాళ్ల సినిమాలే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలో తెగ వైరల్‌గా మారింది.


మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ మీద ప్రస్తుతం నాలుగు సినిమాలు నిర్మితమవుతున్నాయి. అన్నీ పెద్ద సినిమాలే. రెండు అగ్ర స్టార్‌ హీరోల సినిమాలైతే, మరో రెండు కుర్ర స్టార్ల సినిమాలు. వీటిని డిసెంబరు, జనవరి సమయంలో విడుదల చేయాలని నిర్మాణ సంస్థ అనుకుంటోందట. దీంతో 'మైత్రీ' టీమ్‌ ప్లానింగ్‌ అదిరిపోయింది అని అంటున్నారట నెటిజన్లు. అదే సమయంలో ప్లానింగ్‌లో తేడా కొడితే ఇబ్బంది ఎక్కువగానే ఉంటుంది.


 


మైత్రీ వాళ్ల సినిమాలు చూస్తే.. చిరంజీవి - బాబీ సినిమా 'వాల్తేరు వీరయ్య' (సినిమా టైటిల్‌ అధికారికంగా ప్రకటించలేదు) ఉంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని ఇటీవల అధికారికంగా వారు ప్రకటించారు. ఆ తర్వాత బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని సినిమా ఉంది. దీనిని దసరాకు రిలీజ్‌ చేస్తారు అని అనుకున్నా.. ఇప్పుడు డిసెంబరు అంటున్నారట.అయితే బాలకృష్ణ తనకు అచ్చొచ్చిన సంక్రాంతికే తీసుకొద్దాం అని అనుకుంటున్నారట.


 


ఈ రెండూ కాకుండా విజయ్‌ దేవరకొండ - సమంత 'ఖుషీ' ఉంది. ఈ సినిమా డిసెంబరు తొలి వారంలో రావొచ్చు అని తెలుస్తుంది.. అలాగే కల్యాణ్‌రామ్‌తో మరో సినిమా చేస్తోందీ సంస్థ. ఈ సినిమా కూడా డిసెంబరు మధ్యలో కానీ, జనవరి ద్వితీయార్ధంలో కానీ వస్తుంది అంటున్నారట  . ఆ లెక్కన డిసెంబరు, జనవరిలో మైత్రీ వాళ్లకు సినిమాలే సినిమాలు. అయితే విడుదల తేదీల విషయంలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. గతంలో చెప్పిన తేదీల్లో ఇప్పుడు ఈ సినిమాలొస్తాయా? లేక మారుస్తారా అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: