గత రెండు సినిమాలు గా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక పోతున్నాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. తెలుగులో అప్పటివరకు చూడనటువంటి విజయాన్ని అందుకున్న రామ్ ఆ సిని మా తర్వాత మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఆ సినిమా తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ముఖ్యంగా గత సినిమా ది వారియర్ ఏ మాత్రం కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.

దాంతో మళ్లీ సినిమాల ఎంపికలు విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆయన అభిమాను లు విన్నవించుకున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక ఊర మాస్ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్న రామ్ ఆ తర్వాత కూడా సినిమాలను చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా గౌతం మీనన్ దర్శకత్వంలో రామ్సినిమా చేయబోతున్నాడని వార్తలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతున్నాయి. వాస్తవానికి గౌతం సినిమా చేయ డం మంచిదే అయినా కూడా ఆయనకు వరుస ఉన్నాయి.

 అలాంటి దర్శకుడుతో సినిమా చేయడం అవసరమా అని కొంతమంది అభిమానులు చెబుతున్నారు. దర్శకుడుగా ఎన్నో మంచి సినిమాల ను చేశాడు కానీ ప్రస్తుతం ఆయన కెరీర్ బాగోలేని కారణంగా ఆయనతో సినిమా చేయకపోవడమే మంచిదని ఆ రిస్క్ చేయకపోవడమే మంచిది అని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి కాన్స న్ట్రేషన్ బోయపాటి శ్రీను పైనే పెట్టినట్లుగా తెలుస్తుంది ఈ చిత్రాన్ని పూర్తిచేసి విజయాన్ని అందుకున్న తర్వాతనే తదుపరి సినిమా చేయా లని భావిస్తున్నాడు ఈ నేపథ్యం లో బోయపాటి శ్రీను  తో చేసే సినిమా రాముకు భారీ విజయానికి తెచ్చిపెడుతుందా అనేది చూడాలి త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొ దలు కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: