తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న యంగ్ హీరో లలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ హీరో రాజా వారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి మూవీ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఆ తర్వాత శ్రీధర్ గాడే దర్శకత్వంలో తెరకెక్కిన ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. 

ఇలా ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం వరుస పెట్టి మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం కిరణ్ అబ్బవరం ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం సెబాస్టియన్ మూవీ తో కిరణ్ అబ్బవరం మొదట గా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ఈ హీరో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. అలాగే ఈ మూవీ లో రేచీకటి గల వ్యక్తిగా కిరణ్ అబ్బవరం కనిపించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయింది.

ఆ తర్వాత సమ్మతమే మూవీ లో కిరణ్ అబ్బవరం హీరో గా నటించాడు. ఈ మూవీ లో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి కూడా బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. ఇలా ఇప్పటికే ఈ హీరో మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం కూడా వరస మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: