తమిళ్ హీరో కార్తీ అందరికి సుపరిచితమే. ఈయన  మొదటి సినిమానుంచి కార్తీ నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్స్ అందుకున్నాయి.అయితే ఇటీవలే సుల్తాన్ సినిమాతో ఆకట్టుకున్న కార్తీ ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక హీరో కార్తీ, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సర్దార్.కాగా కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. 

 నాగార్జున స్వయంగా ఈ చిత్రం రైట్స్ తీసుకోవటానికి ఉత్సాహం చూపించారని తెలుస్తోంది.అయితే  ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇక కార్తికి, నాగార్జున కు ఉన్న అనుబందంతోనే ఈ సినిమా తీసుకున్నాడనుకున్నారు.ఇక  వీళ్లిద్దరూ కలిసి ఊపిరి చిత్రం చేసారు. అది అసలైన కారణం కాదని, వేరే ఉందని తెలుస్తోంది. ఇక అదేమిటంటే...అభిమన్యుడు' చిత్రంతో ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. ఇక టెక్నాలజీకల్ థ్రిల్లర్స్ అందించడంలో పేరుపొందిన ఈ దర్శకుడు 'సర్దార్‌'కథను మొదట నాగార్జునకు చెప్పారట. అఖిల్, నాగార్జున కలిపి చెయ్యటం కోసం. ఈ కథ విన్నాక చాలా బాగుందని మెచ్చుకున్నారట. , ఇది అఖిల్ కు చాలా పెద్దదై పోతుందని, మోయటం కష్టమని నాగ్ ఫీలయ్యానని చెప్పారట.  

అఖిల్ కోసం ఓకే చేసిన ఏజెంట్ కూడా స్పై థ్రిల్లర్ అని చెప్పారట. ఇక అందుకు అనుభవం, మాస్ ఇమేజ్ ఉన్న హీరో అయితే బెస్ట్ అని కార్తి దగ్గరకు పంపారట. అయితే నాగార్జునకు అనుకున్న పాత్ర, అఖిల్ కు అనుకున్న పాత్ర రెండూ కార్తీ చేతే చేయించి ఈ సినిమా తీసారని సమాచారం.ఇక  కార్తి మారువేషంలో ఉన్న సర్దార్‌గా, ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ప్రకాష్‌గా ద్విపాత్రాభినయంలో చేసారు.ఇక  దాంతో ఆ కథపై ఉన్న ఇష్టం,నమ్మకంతో నాగ్ ఈ రైట్స్ ని తీసుకున్నారని తెలుస్తోంది.అయితే  ఇప్పుడు అఖిల్ కోసం మరో ఆసక్తికరమైన కథను రెడీ చేస్తున్నారు మిత్రన్. కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక  ఈ క్రేజీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా సర్దార్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు.ఇక  సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: