కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రోగ్రాం పేరే ఇంటిపేరుగా మార్చుకొని కలర్స్ స్వాతిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ తెలుగమ్మాయి వరుస అవకాశాలు అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు కలర్స్ స్వాతికి ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇకపోతే అంతలా టార్చర్ పెట్టింది మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మొదట డేంజర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కలర్స్ స్వాతి ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్వాతి కేవలం హీరోయిన్ కాకుండా సింగర్ గా కూడా  పాటలు పాడిందట. అయితే సినిమాల్లో పాటలు పాడడానికి మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదట. కానీ కలర్ స్వాతిలో ఉన్న టాలెంట్ను గుర్తించిన మ్యూజిక్ డైరెక్టర్ గ్రేవీ శ్రీ ప్రసాద్ ఆమెను ఒక చిత్రంలోని పాట పాడడానికి చాలా ఫోర్స్ చేశారట. వాస్తవానికి కలర్స్ స్వాతి డిఎస్పి చెప్పిన కానీ పాటలు పాడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపు చూపించకపోవడంతో ఆమెకు పదే పదే ఫోన్ చేస్తూ మెసేజ్లు చేస్తూ చాలా విసిగించేవారట.


అంతేకాదు ఆమె పాట పాడమని ఏకంగా ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులతో అడగడంతో తను ఇక భరించలేక దేవిశ్రీప్రసాద్ కోసం పాట పాడడానికి సిద్ధమైందట కలర్స్ స్వాతి. ఆ పాటని 100% సినిమాలో ఎ స్క్వేర్ బి స్క్వేర్ అనే పాట ఫిమేల్ వర్షన్ పాడింది కలర్స్ స్వాతినే నట. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ సినిమాలోని ఈ పాట చాలా హైలైట్ గా మారింది. అయితే కలర్స్ స్వాతి కేవలం కొన్ని చిత్రాలలోని నటించిన ప్రస్తుతం తన కుటుంబంతో చాలా ఎంజాయ్ చేస్తోంది స్వాతి.

మరింత సమాచారం తెలుసుకోండి: