టాలీవుడ్లో డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ గా పేరు పొందారు పూరి జగన్నాథ్ ప్రస్తుతం తను తెరకెక్కించిన సినిమాలన్నీ భారీ డిజాస్టర్ కావడంతో కాస్త ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా లైగర్ సినిమా విషయంలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకి నెగెటివిటీ రావడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిక్యూటర్లు సైతం ఈ సినిమా కొన్నందుకు నష్టాలు వచ్చాయని పలు వివాదాలు తెలియజేస్తూ ఉన్నారు .ఈ సినిమా వల్ల చాలా నష్టపోయామని పూరి జగన్నాథ్ ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని ధర్నాలు చేయడం జరిగింది.


ఇక ఈ విషయంపై పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాడు పూరి జగన్నాథ్.తన సినిమా వల్ల నష్టపోయిన వారికి కొంత మెరుగు తిరిగి ఇవ్వాలని ఒప్పుకున్నారు. అయితే అందుకోసం కాస్త టైం తీసుకున్న పూరి గడువులోపుల డబ్బులు తిరిగి ఇవ్వలేకపోవడంతో ఈ వివాదం మరింత తలెత్తింది దీంతో బయ్యర్లు, ఎగ్జిక్యూటర్లు సైతం పూరి జగన్నాథ్ ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. తాజాగా పూరి జగన్నాథ్ రాసిన ఒక లెటర్ నెట్టింట వైరల్ గా మారుతోంది.


సక్సెస్ మరియు ఫెయిల్యూర్ ఈ రెండు వ్యతిరేకంగా అనుకుంటాము కానీ .. అది నిజం కాదని రెండు ఒకదాని తర్వాత ఇంకోటి వస్తాయని పూరి జగన్నాథ్ లేఖలో తెలియజేశారు. ఏది ఎక్కడ శాశ్వతం కాదు లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటన మనకు అనుభవంలో చూడాలి తప్ప ఫెయిల్యూర్ సక్సెస్ లో చూడకూడదని పూరి జగన్నా తెలియజేశారు. సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి ఫెయిల్యూర్ అయితే జ్ఞానం వస్తుంది కాబట్టి ఎప్పుడు మెంటల్గా ఫైనాన్స్ చేయాలిగా గెయిన్ అవుతూనే ఉంటాం తప్ప ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏమీ లేదని విషయాన్ని రాసుకొచ్చారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రాసిన లెటర్ వైరల్ గా మారుతోంది.కేవలం నేను ఎవరిని మోసం చేయలేదు అభిమానులను మాత్రమే.. తనని నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియోన్స్ తప్ప నేను ఎవరిని మోసం చేయలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: