రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ఈ సంవత్సరం రాదే శ్యామ్ అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించగా , పూజా హెగ్డేమూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో చిత్ర బృందం తెరకెక్కించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. దానితో రాధే శ్యామ్ మూవీ తో ప్రభాస్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం లభించింది. ప్రభాస్ అనేక మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు.

మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఆది పురుష్ మూవీ ని 16 జూన్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని 28 సెప్టెంబర్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ తో పాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని 2024 వ సంవత్సరం చివరలో కానీ 2025 వ సంవత్సరం మొదట కాని విడుదల చేసే అవకాశం  ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ,  మారుతి దర్శకత్వం లో ఒక మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని 2024 దసరా పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: