తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మలయాళ నటుడు స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మృణాల్ ఠాగూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈ చిత్రంలో సీతగా అద్భుతమైన నటన ప్రదర్శించింది ఈ ముద్దుగుమ్మ. ఇక సీరియల్స్ ద్వారా క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు ఆ తర్వాత మరాఠీ హిందీ వంటి భాషలలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.


కానీ సీతారామం చిత్రం విడుదలైన తర్వాత ఈమె ఓవర్ నైట్ కి పాపులర్ అయింది  ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా అవుతుందని అందరు అనుకున్నారు.కానీ ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ కొన్ని నెలలు కావస్తున్న తన తదుపరి ప్రాజెక్టుల గురించి తెలియజేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గానే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడు తన అంద చందాలతో కుర్రకారులను సైతం గుండెల్లో గుబులు రేపేలా కనిపిస్తూ ఉంటుంది. దీంతో పలువురు అభిమానులు సైతం ఎప్పుడూ ఇలాంటి ఫోటోలేనా సినిమా అనౌన్స్మెంట్ చేయడం లేదు అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.


కానీ మృణాల్ ఠాగూర్ మాత్రం వీటన్నిటికీ రెస్పాన్స్ కాకుండా సైలెంట్ గానే ఉంటోంది. సీతారామం సినిమా తర్వాత మళ్లీ అదే స్థాయిలో సక్సెస్ సాధించాలని ఈమె భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కథ ల ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతన కొత్త ప్రాజెక్టులు కాస్త ఆలస్యంగా ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీతారామం చిత్రం ఘనవిజయం సాధించడంతో మృణాల్ రెమ్యూనరేషన్ ను బాగా పెంచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈమె డిమాండ్ ను చూసి దర్శక నిర్మాతలు సైతం వెనకడుగు వేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటన్నది క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: