ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రెండు బడ సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రెండు కూడా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. ఇక ఈ సినిమాల కోసం వీరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి జనవరి 12న విడుదలవుతుంది .ఇక దాని మరుసటి రోజు జనవరి 13న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాలోని జై బాలయ్య మా బావ మనోభావాలు మాస్ మొగుడు పాటలు బ్లాక్బస్టర్ హిట్స్ గా నిలచాయి.

 అంతేకాదు ఇటు వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ నో శ్రీదేవి నేను చిరంజీవి మరియు వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలలోను హీరోయిన్గా శృతిహాసన్ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా శృతిహాసన్ ఈ రెండు సినిమాల గురించి తన ఎక్స్పీరియన్స్ ని పంచుకుంది. ఇక ఇందులో భాగంగానే శృతిహాసన్ మాట్లాడుతూ.. నిజంగా నేను దీన్ని అస్సలు ఊహించలేదు.. నా సినీ కెరియర్లో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండవసారి.. ఏడేళ్ల క్రితం నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి..చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అలా జరుగుతుంది..

బాలకృష్ణ గారు చిరంజీవి గారు లాంటి ఇద్దరు లెజెండరీ హీరోలతో నటించిన రెండు సినిమాలు కూడా ఈ సంక్రాంతికి విడుదల అవుతున్నాయి.. ఇందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.. ఇలా జరగడం నా అదృష్టం.. ఈ రెండు సినిమాలలోనూ భిన్నమైన కథలు భిన్నమైన పాత్రలలో నేను నటించాను.. బాలకృష్ణ సినిమాలో నా పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది.. ఇక చిరంజీవి సినిమాలో ఎవరు ఊహించిన విధంగా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది..బాబీ కి ఈ సినిమా విషయంలో నేను థాంక్స్ చెప్పాలి.. ఇక వీర సింహారెడ్డి సినిమాలో నా పాత్ర చాలా కామెడీగా ఉంటుంది..కామెడీ చేయడం అంటే సహజంగానే నాకు చాలా ఇష్టం.. ఇక చిరంజీవి బాలకృష్ణ గారితో డాన్స్ చేయడం ఒక మంచి అనుభవం.. వారిద్దరూ చాలా మంచి డాన్సర్లు అంటూ చెప్పవచ్చింది శృతిహాసన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: