అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో కాస్త గ్యాప్ దొరికిన కుటుంబంతో వెకేషన్ కు వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.ఇక గడిచిన కొద్దిరోజుల క్రితం బాలీవుడ్లో ఒక చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటిస్తున్న జవాన్ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.


ఇక దింతో అభిమానులు ఈ విషయం తెలియడంతో షారుక్ సినిమాలో బన్నీ గెస్ట్ అంటే.. అది మా హీరో రేంజ్ అంటూ చాలా రెచ్చిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా వీరందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించడానికి అల్లు అర్జున్ నో చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అల్లు అర్జున్ని మాత్రం గెస్ట్ గా చూపించడానికి డైరెక్టర్ పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ అల్లు అర్జున్ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ మాత్రం ఎక్కువగా పుష్ప-2 చిత్రం కోసమే ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా సమాచారం.


దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ లేరు కాబట్టి ఈ చిత్రంలో ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో విజయ్ దళపతి నటించే అవకాశం ఉందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ విషయం తెలియగానే కాస్త నిరుత్సాహం చెందారు ఇక మిగతా వారు మాత్రం వీరిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.. ఏది ఏమైనా షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో తన తదుపరి చిత్రాల పైన కూడా మంచి హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: