టాలీవుడ్ లో నటుడు హాస్యనటుడుగా పేరుపొందిన కమెడియన్లలో ఎమ్మెస్ నారాయణ కూడా ఒకరు. కెరియర్ బాగా సాగుతున్న సమయంలోనే ఎమ్మెస్ నారాయణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.2015 సంవత్సరంలో ఆయన కన్నుమూయడం జరిగింది. మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎమ్మెస్ నారాయణ 23 సంవత్సరాల లోపు దాదాపుగా 750 కు పైగా సినిమాలలో నటించారు. ఎమ్మెస్ నారాయణ గారు చనిపోయే ముందు వరకు కూడా కామెడీ పరంగా మంచి డిమాండ్ ఉన్న కమెడియన్ గా పేరు సంపాదించారు.


ఒక్కో ఏడాదికి 30కు పైగా సినిమాలలో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎమ్మెస్ నారాయణకు. ఎమ్మెస్ నారాయణ చనిపోయే ఏడాదిలోపే దాదాపుగా 11 సినిమాలు విడుదలయ్యాయి.. ముఖ్యంగా ఎమ్మెస్ నారాయణ ఎక్కువగా నటించిన పాత్రలలో తాగుబోతు క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఆయన బ్రతికి ఉన్న రోజులలో ఎన్నో ఇంటర్వ్యూలో ఇచ్చిన ఇది అంశం గురించి అడగగా ఆయన అందుకు సమాధానం చెబుతూ అప్పట్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో నాగబాబు హీరోగా నటించిన రుక్మిణి చిత్రంలో నటించాను.


ఆ సినిమాలో నేను నాగబాబుకు అసిస్టెంట్ గా తాగుబోతు లాగా కనిపిస్తాను నేను అప్పటివరకు తాగుబోతు పాత్రలు చేయలేదు. నన్ను ప్రోత్సహిస్తూ ఆ పాత్రని అవలీలాగా చేయించేలా చేశారు నాగబాబు గారు.. ఆయన వల్లే నేను తాగుబోతు పాత్రలను అలవాటు చేసుకున్న.. ముఖ్యంగా తాగిన తర్వాత  నేను మాట్లాడినప్పుడు మాట్లాడే వ్యాస ప్రేక్షకులను బాగా కడుపుబ్బ నవ్విస్తుంది.. అందుకోసమే డైరెక్టర్లు కూడా తనకు ఎక్కువగా అలాంటి పాత్రలే రాస్తూ ఉంటారని ఎమ్మెస్ నారాయణ తెలిపారు. ఎమ్మెస్ నారాయణ కేవలం కమెడియన్ మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప రచయిత మరియు డైరెక్టర్ కూడా.. ఎన్నో చిత్రాలలో నటించిన ఎమ్మెస్ నారాయణ లేరని విషయం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈయన కామెడీస్ అన్ని వేశారు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు ఇప్పటికీ బాగా ఆదరిస్తూ ఉన్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: