టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. కమర్షియల్ హంగులతో మంచి మాస ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్, మేజర్ అజయ్ కృష్ణ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నారు. మహేష్ ప్రక్కన హీరోయిన్ గా చలో, మరియు గీత గోవిందం సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించిన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, రాములమ్మ విజయశాంతి గారు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాతో పాటు అదే రోజున స్టైలిష్ స్టార్ బన్నీ నటిస్తున్న అలవైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ అవుతుండడంతో తెలుగు ప్రేక్షకుల కళ్ళు ఎక్కువగా ఈ రెండు సినిమాల మీదనే ఉన్నాయి. 

నిజానికి అదే సంక్రాంతికి కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు మురుగదాస్ ల కాంబినేషలో తెరకెక్కుతున్న దర్బార్ సినిమా ఉండడం, అది తెలుగులో కూడా రిలీజ్ అవుతుండడంతో ఆ సమయంలో రిలీజ్ అయ్యే సినిమాల మధ్య పోటీ బాగా పెరిగింది. ఇక అదే సమయానికి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా, వెంకటేష్ మరియు నాగచైతన్యల వెంకీ మామ, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న రూలర్ సినిమాలు కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే వాటిలో ఇప్పటికే బాలకృష్ణ గారి రూలర్ డిసెంబర్ 20న రిలీజ్ అవుతుండగా, వెంకీ మామ మరియు ఇంతమంచి వాడవురా సినిమా నిర్మాతలు కూడా ఆ విధంగా వెనక్కి, లేదా ముందుకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఎందుకంటే ఆ సమయంలో వస్తున్న మహేష్

బన్నీల సినిమాల పైనే మెజారిటీ ప్రేక్షకుల ఫోకస్ ఉంటుందని, అందునా కొన్నాళ్ల నుండి మహేష్ బాబు సరైన మాస్ సినిమాలో నటిచకపోవడంతో, ప్రస్తుతం తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు మంచి మాస్ అంశాల కలయికలో తెరక్కుతుండడంతో, సినిమాకు టాక్ ఏ మాత్రం వచ్చినా దాని ముందు నిలబడే అవకాశం మిగతా సినిమాలకు ఒకింత తక్కువే కావడంతో కొంత ఆలోచనలో పడ్డారట. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోల రేస్ లో ఉండే మహేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ మంచి మాస్ సినిమా పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో వారిద్దరూ నటించిన పలు సినిమాలు గతంలో నిరూపించాయి. మరి ఈ సారి మహేష్ ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: