టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించడం జరిగింది. నిజానికి రెండేళ్లుగా సరైన సక్సెస్ లేని బన్నీకి ఈ సినిమా మంచి బ్రేక్ ని ఇచ్చిందనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ని పురస్కరించుకుని ఇప్పటికే రెండు సక్సెస్ మీట్లు నిర్వహించిన సినిమా యూనిట్, ఈ విజయం ప్రేక్షక విజయం అని, అలానే ఈ సినిమా కోసం పని చేసిన లైట్ బాయ్ దగ్గరి నుండి దర్శకుడు త్రివిక్రమ్ గారి వరకు ప్రతి ఒక్కరికి హీరో అల్లు అర్జున్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

 

ఇక తమ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో నాన్ బాహుబలి 2 రికార్డ్స్ అందుకుందని సినిమా యూనిట్ నిన్న ప్రకటించడం జరిగింది. కాగా సినిమా సక్సెస్ ని పురస్కరించుకుని ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు హీరో అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా వెళ్లి కలిసి కృతజ్ఞతలు చెప్పారు. అయితే ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అలానే ఒక మంచి సినిమాని వారి వద్దకు చేర్చడానికి జర్నలిస్టులు మంచి వారధి వంటి వారని, అందుకే మీకోసం నా వంతుగా ఒక పది లక్షలు మీ ‘ఫిల్మ్ న్యూస్‌ క్యాస్టర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' వారికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు అర్జున్. 

 

మీరు చేస్తున్న గొప్ప పనులు, అలానే సేవా కార్యక్రమాలు తనకు తెలుసునని, ఇక జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, సంక్షేమం వంటి కార్యక్రమాలు చేపట్టడం తనకు ఎంతో నచ్చిందని, అందుకే తనవంతుగా ఏదో కొద్దిపాటి సాయం చేసానని అల్లు అర్జున్ అన్నారు. అయితే అర్జున్ గొప్ప మనసుపై పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ, నిజానికి తాము అలవైకుంఠపురములో బిగ్గెస్ట్ సక్సెస్ సాదించినందకు అర్జున్ గారిని అభినందించడానికి వచ్చాము అని, అయితే మా సంక్షేమం కోసం ఆయన ఈ విధంగా విరాళం ఇవ్వడం వారి గొప్ప మనసుని నిదర్శనం అని అన్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: