జూనియర్ ఎన్టీఆర్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కళ్యాణ్ రామ్ జూనియర్ ల మధ్య పెద్దగా చెప్పుకోతగ్గ సాన్నిహిత్యం లేదు. దీనితో కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన సినిమాలు అన్నింటిలోను కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు. 


అయితే ఒకటి రెండు సినిమాలు తప్ప కళ్యాణ్ రామ్ సొంత ప్రొడక్షన్ హౌస్ పై వచ్చిన సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ యూటర్న్ తీసుకుని జూనియర్ తో ‘జై లవ కుశ’ తన సొంత బ్యానర్ పై తీసాడు. ఈసినిమాకు హిట్ టాక్ వచ్చినా కళ్యాణ్ రామ్ కోరుకున్న స్థాయిలో భారీ కలక్షన్స్ రాలేదు. 


ఇలాంటి పరిస్థితులలో హరికృష్ణ మరణం తరువాత మరింత సన్నిహితంగా మారిన వీరిద్దరి కలయికలో మరొక సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందడానికి రంగం సిద్ధం అయింది. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ అనుకోని సమస్యలతో ఆలస్యం అవుతున్న పరిస్థితులలో ఈమూవీ ఈఏడాది చివరకు ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. 


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసుకుందామని చేస్తున్న ఆలోచనలకు కళ్యాణ్ రామ్ తనకు జూనియర్ తో ఉన్న సాన్నిహిత్యంతో సొంత ప్రొడక్షన్ హౌస్ ఆలోచనలు వదులుకోమని తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జూనియర్ తో వరసగా సినిమాలు తీసే అవకాశం ఇవ్వవలసిందిగా ఒత్తిడి చేసినట్లు టాక్. దీనితో జూనియర్ ప్రశాంత్ నీల్ తో చేయబోయే మూవీ ప్రాజెక్ట్ ను కూడ నిర్మించే బాధ్యత కళ్యాణ్ రామ్ కే ఇచ్చినట్లు టాక్. కరోనా ప్రభావంతో టాప్ హీరోలు అంతా తమ భారీ పారితోషికాలు తగ్గించుకోవలసిన పరిస్థితులు ఏర్పడటంతో బయట నిర్మాతలకు సినిమాలు చేస్తూ తమ పారితోషికాలు తగ్గించుకునే బదులు తమ సొంత బ్యానర్ లో సొంత వారినే నిర్మాతలుగా మార్చి లాభాలలో భారీ వాటా తీసుకోవాలి అని జూనియర్ కు కూడ వచ్చిన కొత్త ఆలోచనలతో ఇక రానున్న రోజులలో జూనియర్ నటించే ఎక్కువ సినిమాలు కళ్యాణ్ రామ్ సొంత ప్రొడక్షన్ హోస్ పై మాత్రమే ఉంటాయి అన్నలీకులు ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్నాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: