ఇండస్ట్రీలో ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎన్నిసార్లు చూసినా మళ్ళి మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా అదే సస్పెన్స్ ఆ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సినిమాల్లో ఒకటి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాక్షసుడు. సైకో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాని రమేష్ వర్మ తెరకెక్కించారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 

 

 

 అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కెరీర్ లో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు చేశాడు. ఎన్నో భారీ యాక్షన్ సినిమాలను కూడా చేశాడు. ఆకట్టుకునే బాడీతో  అదిరిపోయే యాక్షన్  లతో అదరగొట్టాడు.. కానీ ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్ మాత్రం రాక్షసుడు సినిమా తో వచ్చింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు. నటుడిగా రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎన్నో  మెట్లు ఎక్కి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే ప్రతి క్షణం సినిమా గగ్గుర్లు పొడిచేలా  సస్పెన్స్ ధ్రిల్లర్ గా కొనసాగుతూ ఉంటుంది. 

 

 

 కనీసం చూపు పక్కకు తిప్పుకొనినివ్వదు. అంతలా సినిమా చూస్తున్న ప్రేక్షకుల ను ప్రభావితం చేస్తుంది ఈ సినిమా. ఒక సైకో పాఠశాలలోనే విద్యార్థులను ఎంపిక చేసుకొని అతి దారుణంగా హత్య చేయడం ఈ సినిమాలు చూడొచ్చు. సైకో కిల్లర్ ఎవరు అనే దానిపై పోలీసులు వేసే ఎత్తుగడలు... ఎదురయ్యే సంఘటనలు సినిమా చూస్తున్న ప్రేక్షకులందరినీ కళ్లార్పకుండా సినిమా చూసేలా చేస్తాయి. అసలు ప్రేక్షకులు ఎవరూ ఊహించని విధంగా... ఈ సస్పెన్స్ త్రిల్లర్ సినిమాలో  చివర్లో విలన్ ఎవరు అన్నది రివీల్ చేయగానే అసలు సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా నమ్మలేని పరిస్థితి ఉంటుంది. అంతలా సస్పెన్స్ థ్రిల్లర్ గా మంచి పేరు తెచ్చుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: