ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస హిట్లతో మంచి దూకుడు మీద ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలతో వరుస హిట్లు అందుకొని స్టార్ హీరోల రేసులో ముందున్నాడు. ఇక తాజాగా తన కొత్త సినిమాని గీతా గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా కి సర్కారు వారి పాట అనే టైటిల్ ఖరారు చేస్తూ ఇటీవల మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఇక కరోనా కారణంగా ఇన్ని రోజులు ఆగిన ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలు కానుంది. అందులో భాగంగా ఇప్పటికే మేకర్స్ యూఎస్ లో లొకేషన్స్ వేటలో ఉన్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో మొదలు కానుంది. దాదాపు 45 రోజుల పాటు అమెరికాలో షెడ్యూల్ ప్లాన్ చేశారని వినికిడి.

అయితే ఈలోగా సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసేద్దాం అని దర్శకుడు పరశురామ్ చెప్పినట్లు సమాచారం. అందుకు అనుగునంగానే ఈ చిత్రానికి గల మ్యూజిక్ సెషన్స్ ను పూర్తి చేసేయమన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడన్న విషయం తెల్సిందేనిన్న ఇదే విషయాన్ని థమన్ తన ట్విట్టర్ లో తెలియజేసారు. ఈ రోజు నుండి సర్కారు వారి పాట మ్యూజికల్ జర్నీ మొదలవనుంది. ఈ ప్రయానాన్ని ఒక సాంగ్ రికార్డింగ్ తో స్టార్ట్ చేస్తున్నాం. అద్భుతమైన వాయిద్యబృందం మాతో పని చేస్తుంది. అభిమానులందరూ కోరుకునేలా ఈ అల్బమ్ సూపర్ గా ఉండబోతుంది.

నాకు ఈ అవకాశాన్నిచ్చిన మన సూపర్‌స్టార్ మహేష్ కి, దర్శకులు పరశురాం గారికి నా ధన్యవాదాలు అని ట్వీట్ చేసి, అభిమానులకు కిక్ ఇచ్చేలా ఇట్స్ షో టైమ్ అనే కాప్షన్ ను జతపరిచాడు థమన్. ఈ విషయం తెలుసుకుని మహేష్ అభిమానులు ఎంతో ఆనందపడుతున్నారుషూటింగ్ కు వెళ్లే లోగా ట్యూన్స్ పూర్తైపోయి, సాంగ్స్ రికార్డింగ్ కూడా అయిపోతే, షూటింగ్ కు చాలా వీలవుతుందని, సందర్భానికి తగినట్లుగా సాంగ్ షూటింగ్ చేసుకోవచ్చని, ఫాస్ట్ షెడ్యూల్స్ అప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందని మహేష్ దర్శకుడితో చెప్పినట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: