మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుం కోషియం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్. పృధ్విరాజ్, బిజూ మీనన్ కలిసి నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్ లో ఎవరు నటిస్తారన్నది ఇంకా తెలియలేదు. అయితే ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ ను దసరా కానుకగా ఇవ్వనున్నారు సితార బ్యానర్.

ఇందులు సంబందించిన మెసేజ్ ను ట్విట్టర్ ద్వారా పెట్టారు. రేపు ఓ స్వీట్ సర్ ప్రైజ్ రాబోతుందని హారిక హాసిని బ్యానర్ నుండి ట్వీట్ చేశారు. అయితే ఈ స్వీట్ సర్ ప్రైజ్రీమేక్ గురించే అని అంటున్నారు. అయ్యప్పనుం కోషియం రీమేక్ లో పవన్, రానా ఫైనల్ కాస్టింగ్ అని తెలుస్తుంది. సాగర్ చంద్ర డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. దసరా సందర్భంగా ఈ సినిమా అప్డేట్ వస్తుందట.

పవన్, రానా లు కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తే సినిమాపై కచ్చితంగా అంచనాలు పెరిగినట్టే. పవన్ చేస్తానంటే ఈ సినిమాకు మాటలు రాసేందుకు సిద్ధమయ్యాడు త్రివిక్రం శ్రీనివాస్. మరి త్రివిక్రం ఎంటర్ అయితే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. తప్పకుండా ఏకే తెలుగు రీమెక్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వనుందని చెప్పొచ్చు. పవర్ స్టార్ ఇప్పటికే వకీల్ సాబ్ సెట్స్ మీద ఉంచగా ఆ తర్వాత క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్ లో పెట్టాడు. రానా ప్రస్తుతం విరాట పర్వం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అయ్యప్పనుం కోషియం రీమేక్ లో నటిస్తాడని టాక్.                                              



మరింత సమాచారం తెలుసుకోండి: