యువరాజ్ బ్యాంకు ఖాతా నుంచి నటి రాధికా కుమారస్వామి మరియు మరో నిర్మాతకు కోటి రూపాయిల వరకు బదిలీ అయినట్లు సీసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు విచారణ జరిపేందుకు నిర్ణయించారు. అయితే ఈ విషయంపై రాధిక ఈ విధంగా స్పందించారు. యువరాజ్ కుటుంబానికి – తమ కుటుంబానికి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయని... మా ఇరు కుటుంబాలు ఎప్పటినుండో సన్నిహితంగా ఉంటున్నాయని... రాధికా కుమారస్వామి తెలిపారు. బెంగళూరు డాలర్స్ కాలనీలో విలేకర్లతో బుధవారం మాట్లాడిన ఆమె ఇలా అన్నారు. యువరాజ్ అకౌంట్ నుంచి నా అకౌంట్ కు రూ.15 లక్షలు బదిలీ అయిన మాట వాస్తవమే.
కానీ ఒక సినిమా అడ్వాన్స్గా తన ఖాతాకు బదిలీ అయిందన్నారు. అయితే అంతా అనుకుంటున్నట్లుగా తన తమ్ముడు రవిరాజ్ అకౌంట్కు మాత్రం డబ్బు ఏమి బదిలీ కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీసీబీ అధికారులు ఏ క్షణమైనా రాధికా కుమారస్వామిని అదుపులోకి తీసుకునే అవకాశముంది. ఇంతకీ వాస్తవంగా జరిగిన విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఈ విచారణలో రెండు మూడు రోజులలోనే మరికొన్ని వాస్తవాలు బయటపడే అవకాశముంది. దీనిపై సీసీబీ అధికారులు ఇంకా స్పందించలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి