టాలీవుడ్
సినిమా పరిశ్రమలో
హీరోయిన్ ప్రణీత అంటే తెలియని వారు ఉండరు. సిద్ధార్థ హీరోగా నటించిన బావ
సినిమా ద్వారా తెలుగు
సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన ఈమె అంతకుముందు ఓ
కన్నడ సినిమాలో నటించి మంచి పేరు దక్కించుకుంది.
తమిళ సినిమా పరిశ్రమలో సైతం నటించి అక్కడి వారిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో ఆమె నేరుగా పవన్
కళ్యాణ్ నటించిన
అత్తారింటికి దారేది సినిమాలో ఓ పాత్రను పోషించింది. ఏమైందో ఏమో కానీ
హీరోయిన్ గా ఛాన్స్ లు ఈమె ఎక్కువగా దక్కించుకో లేదనే చెప్పాలి. మొదటి
సినిమా తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో
హీరోయిన్ గా చేయలేదు.
అందుకు కారణం లేకపోలేదు. తొలి
సినిమా చేసిన వెంటనే ఆమె ఇతర భాషలలోకి వెళ్లడం అని తెలుస్తుంది. తొలి
సినిమా తర్వాత వెంటనే ఇతర భాషలలో బిజీ అయిపోవడంతో తెలుగు వారు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆమె తెలుగులోకి మళ్లీ వచ్చిన అప్పటికి టైం అయిపోవడంతో కీలకమైన పాత్రలకే పరిమితమైపోయింది. ఆ విధంగా
ఎన్టీఆర్ నటించిన రభస, మహేష్ నటించిన బ్రహ్మోత్సవం, రామ్ నటించిన
హలో గురు ప్రేమకోసమే సినిమాలో సైడ్
హీరోయిన్ పాత్రలు చేసింది. సినిమాల్లో ఆమెకు ఎంతకీ అదృష్టం దక్కకపోవడంతో ఈమె ఇది ఇటీవలే
పెళ్లి చేసుకుంది.
అయితే
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించగల ను అనే ఒక హోప్ హంగామా 2
సినిమా ద్వారా ఆమెలో ఏర్పడింది. కానీ ఆ
సినిమా విడుదలైన తర్వాత భారీ ఫ్లాప్ అవడంతో ఆమెకు ఉన్న ఒకే ఒక హోప్ కూడా పోయింది. ప్రస్తుతం భుజ్ అనే మరో
హిందీ సినిమాలో కూడా నటిస్తుంది ఈమె.
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర చేస్తుంది. ఈ
సినిమా అయినా ఆమె కెరీర్ ను సెట్ చేస్తుందో చూడాలి. ఏదేమైనా ప్రణీత కోల కళ్ళతో ప్రేక్షకులను అలరించిన వరుస అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది.