టాలీవుడ్ సినీ పరిశ్రమలో నందమూరి వంశం కు ఉన్న ప్రత్యేకత, క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. నందమూరి తారక రామారావు
టాలీవుడ్ లో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎదగగా ఆయన తర్వాత ఆయన వారసులు కూడా ఎంతో మంది వచ్చారు. వారిలో నందమూరి
బాలకృష్ణ స్టార్ హీరోగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఆ తర్వాత
జూనియర్ ఎన్టీఆర్
కళ్యాణ్ రామ్ లు
హీరో లుగా స్టార్ లు గా ఎదిగారు. ప్రస్తుతం నందమూరి వంశం నుంచి మరో వారసుడు తెరపైకి అడుగుపెట్టబోతున్నాడు.ఆయనే నందమూరి
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.
గత రెండు మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పుడు ఉంటుంది అప్పుడు ఉంటుంది అని నందమూరి అభిమానులు ఎంతో ఆశ పడుతూ వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు
బాలకృష్ణ దానిని దాటవేస్తూ వారిని నిరాశ పరుస్తూనే ఉన్నాడు. పలానా దర్శకుడితో మోక్షజ్ఞ
సినిమా చేయనున్నాడని అడపదడప వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.కానీ అవన్నీ కేవలం ప్రచారం గానే మిగిలిపోయాయి.
ఇప్పుడు మళ్లీ ఆయన సినీ ఎంట్రీ తెరపైకి వచ్చింది.
నందమూరి
బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన
ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే మాట ఇటీవలే వినిపించింది. ఈ సినిమాలో
బాలకృష్ణ తో కూడా కనిపిస్తాడని,
బాలకృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తాడని వార్తలు వినిపించగా ఇప్పుడు ఆ
సినిమా కాదు ఓ కొత్త కథ ద్వారా మోక్షజ్ఞ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడని తెలుస్తుంది. దీంతో ఓ స్టార్
డైరెక్టర్ ఈ సినిమాకి చేస్తాడేమో అనుకున్నారు కానీ ఉప్పెన సినిమాతో భారీ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు దర్శకత్వంలో మోక్షజ్ఞ
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే
బాలకృష్ణ ను కలిసి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మొదలు పెడుతున్నారట ఈ నిర్మాతలు. మరి మెగా
హీరో వైష్ణవ్ తేజ్ కి ఇచ్చిన గ్రాండ్ హిట్ మోక్షజ్ఞ కు బుచ్చిబాబు ఇస్తాడా లేదా చూడాలి.