టాలీవుడ్ ను
కరోనా సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది.
థియేటర్ లలో సినిమాలు విడుదల కాకపోవడంతో నిర్మాతలు ఓ పక్క కృంగి పోయారు. ఇంకోపక్క టికెట్ల రేట్ల విషయంలో సందిగ్ధత నెలకొనడంతో తమ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి విడుదల అవవో అన్న అయోమయంలో ఉన్నారు నిర్మాతలు. పోనీ ఈ గండం నుంచి తప్పించుకునేందుకు ఓటీటీ లో సినిమాలు విడుదల చేయాలని భావిస్తుండగా అక్కడ కూడా వారికి చుక్కెదురే అవుతోంది.
నిర్మాతను ఏ విధంగా ను బతకనివ్వడం లేదు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలను తీసి కొన్ని నెలలుగా తమ వద్ద ఉంచుకొని ఆర్థిక భారాన్ని మోస్తూ ప్రస్తుత ఉపశమనానికి ఓటీటీ లో సినిమాను విడుదల చేస్తే దాని ఫలితం బాగా వస్తుందన్న సమయంలో కొంతమంది దుర్మార్గులు నోటికాడి కూడు లాక్కొని నిర్మాతను చతికిల పడేలా చేస్తున్నారు. కొన్ని
లోకల్ చానల్స్ విడుదలైన సినిమాలను వెంటనే టెలికాస్ట్ చేయడంతో సినిమాకు క్రేజ్ తగ్గి
నిర్మాత కు ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది. తాజాగా
విక్టరీ వెంకటేష్ ప్రియమణి జంటగా
నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం అందరికీ తెలిసిందే.
తమిళ చిత్రం అసురన్ సినిమాకి
రీమేక్ గా తెరకెక్కిన ఈ
సినిమా సూపర్ హిట్ కాగా ఈ సినిమాకు మంచి స్పందన దక్కుతుంది.
అమెజాన్ ప్రైమ్ కు మంచి వ్యాల్యూ తోడవుతుంది. ఇలాంటి సమయంలో ఈ సినిమాను ఓ
లోకల్ ఛానల్ ప్రేక్షకుల అందరికోసం టెలికాస్ట్ చేయడంతో ఒక్కసారిగా
సినిమా మేకర్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఒక్కసారిగా అందరిలో కలవరం సృష్టించిన ఈ ఘటన వల్ల
సినిమా కే కాకుండా
సినిమా పరిశ్రమకు కూడా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది దాంతో సదరు
లోకల్ ఛానల్ కి
సినిమా నిర్మాతలు భారీ ఫైన్ విధించారట. అది కొట్లలో ఉన్నట్లు తెలుస్తుంది.