అంతేకాదు..ఈ సినిమాను ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠ రేపేలా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతోనే ప్రగభల్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాను PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేయాబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను నవంబర్ 30న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేయబోతోన్నట్టు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ సినిమాను దర్శకుడు ప్రగభల్ కి ఆఫ్ రోడ్ రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అనుభవం నుండే ప్రధానంగా మడ్డీ రూపొందించారు. ఈ చిత్రం ఐదు సంవత్సరాల రీసెర్చ్ అనంతరం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని తీసిన ఈ సినిమా ప్రధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం గురించి ఉన్నప్పటికీ ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్రతి ఎమోషన్ లో చిత్రకరించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని తెలుగులో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. దీంతో సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి.