నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది.

ఈ సినిమాలో దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని అఖండ మూవీ ని విడుదల చేసిన తేదీ అయిన డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ కోసం మూవీ యూనిట్ మరో కొత్త తేదీని అనుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ,  గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమానీ వచ్చే సంవత్సరం అనగా 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయాలని మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  

ఇదే తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆది పురుష్ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఒక వేళ బాలకృష్ణ,  గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీని కూడా 2023 జనవరి 12వ తేదీన విడుదల చేసినట్లు అయితే బాలకృష్ణ, ప్రభాస్ ల మధ్య బాక్సాఫీస్ వార్ కన్ఫర్మ్ అయినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: