బాలీవుడ్‌ యాక్టర్లు దక్షిణాది చిత్రాల్లో విలన్ల పాత్రల్లో రాణించడం కొత్తేమీ కాదు. 'కేజీఎఫ్‌-2' చిత్రంలో అధీరా పాత్రలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్‌దత్‌ పండించిన విలనీజం అందరిని ఎంతగానో మెప్పించింది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌' సినిమాలో కూడా బాలీవుడ్‌ అగ్ర హీరో సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడుగా విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ మరో తెలుగు అగ్ర హీరో చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించడానికి అంగీకరించారని తెలిసింది.టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాకి నిర్మాత. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించబోతున్నారని తెలిసింది. 


కథానుగుణంగా శక్తివంతమైన విలన్‌ క్యారెక్టర్‌ కోసం దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ హిందీ అగ్ర నటుణ్ణి ఎంపిక చేసుకోకవాలనుకున్నారని, చివరకు సైఫ్‌అలీఖాన్‌ పేరును ఖరారు చేశారని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌ క్రేజ్‌ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ ఇంకా అలాగే ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసి పెద్ద పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా రూపొందించాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ క్రమంలో భారీ యాక్షన్ సీన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో ఎన్నో రకాల భారీ అంచనాలు వున్నాయి. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఇక మహేష్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ కావడం పక్కా.

మరింత సమాచారం తెలుసుకోండి: