
జనవరి 31వ తేదీన మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మైకేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం ఈవెంట్ ముఖ్యఅతిథి గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఎవరు వస్తారు అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మరొకవైపు ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ తదితరులు హీరోలు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు కరణ్ సీ. ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా సిఎస్ సామ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
మొత్తానికైతే సందీప్ కిషన్ ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి .. థ్రిల్ ఫీల్ చేయడానికి ప్రయత్నాలు చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఒక్క సినిమాతో కూడా సరైన సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. దీంతో యావరేజ్ హీరోగా మిగిలిన ఈయన ఈసారి మైఖేల్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరి ఈ సినిమా సందీప్ కిషన్ కి ఏ విధమైనటువంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.