ఈ సందర్భంగా ఓ క్రేజీ విషయాన్ని బయటపెట్టారు విజయేంద్రపసాద్. ఈ సినిమాకి ఓపెన్ ఎండ్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. సీక్వెల్ కి అవకాశం ఉండేలా ఓపెన్ ఎండ్(ముగింపు తెరిచే ఉండేలా) ఇస్తున్నామని, సీక్వెల్స్ తీసుకోవచ్చని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ చెప్పారు. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ ఫ్యాన్స్ కి గూజ్బంమ్స్ తెప్పిస్తుంది. వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. `గుంటూరు కారం` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. మీనాక్షి చౌదరి పేరు మరో కథానాయికగా వినిపిస్తుంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతుంది. నెక్ట్స్ షెడ్యూల్ ఈ రోజు(జూన్ 24) నుంచే ప్రారంభమయ్యింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక మహేష్ ఇక రాజమౌళి సినిమాపైనే ఫోకస్ పెడతారు. ఇందులో హాలీవుడ్ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు కూడా పనిచేయబోతున్నారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి