అలాగే తాజాగా అల్లు అర్జున్ జాతకంలో అతిపెద్ద దోషం ఉందని, ఆ దోషం పోవాలంటే ఖచ్చితంగా పరిహార పూజ చేయాలని,ఈ పూజ గనుక చేస్తే కచ్చితంగా ఇండస్ట్రీని ఏలే స్థాయికి అల్లు అర్జున్ వెళ్తాడని ఒక జ్యోతిష్యుడు చెప్పాడట. ఒకవేళ ఈ పరిహార పూజ చేయించకపోతే అల్లు అర్జున్ కి అన్ని అశుభలే జరుగుతాయి అని చెప్పడంతో పరుగు పరుగున తల్లి నిర్మల భార్య స్నేహ రెడ్డి అల్లు అర్జున్ తో ఈ పరిహార పూజ చేయించడానికి ఒప్పించారట.ఇక అల్లు అర్జున్ ఒప్పుకోవడం తోనే అర్ధరాత్రి పూట వారి ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లి అల్లు అర్జున్ తన భార్య పిల్లలు అలాగే తల్లి నిర్మల అందరూ ఆ పూజలో పాల్గొని అల్లు అర్జున్ కి ఉన్న దోషానికి సంబంధించి పరిహార పూజ చేసి ఆ దోషం పోవాలని కోరుకున్నారంటూ నెట్టింట ఒక వార్త వైరల్ గా మారింది. అయితే ఈ వార్త ప్రస్తుతం మీడియాలో సెన్సేషన్ సృష్టించడంతో చాలామంది అభిమానులు నిజంగానే అల్లు అర్జున్ అర్ధరాత్రి పూజలు చేశారా అంటూ షాక్ అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి