కోలీవుడ్ టాలీవుడ్ లో కమలహాసన్ కూతురుగా శృతిహాసన్ మంచి క్రేజీ సంపాదించకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన శృతిహాసన్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇదంతా ఇలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా శృతిహాసన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.తరచూ ఏదో ఒక విషయంలో ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తూనే ఉంది.


ఇప్పుడు తాజాగా మరొకసారి ఈమె చేసిన కామెంట్స్ వల్ల వైరల్ గా మారుతోంది.. జీవితంలో గాఢంగా ప్రేమించిన ఒక వ్యక్తితో ఉన్న అనుబంధం జీవితం ప్రేమలో ఫెయిల్ అయితే వీటన్నిటిని నాలుగు నిమిషాల వీడియో సాంగులో చెప్పాలనుకున్నామని ముందు ఈ సాంగ్ ని తన పియానో మీద ఇంగ్లీషులో రాసుకున్నానని.. ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి తగ్గట్టుగానే దృష్టిలో పెట్టుకొని రూపొందించాను అంటూ నా ఉద్దేశంలో ప్రేమ ఒక మాయ అన్నట్టుగా తెలియజేసింది..


అలాగే పంచదార ఆరోగ్యానికి మంచిది కాదని షుగర్ క్యాండిల్ లను ఇష్టంగా తింటాము ప్రేమ కూడా అంతే అని ఒక మాయ ఊబి లాంటిది అంటు తెలియజేసింది.. ముఖ్యంగా ఇనిమెల్ లో డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఒక నటుడుగా మాత్రమే కనిపిస్తారంటూ తెలిపింది. అయితే ఇలాంటి ఒక డైరెక్టర్ ని పట్టుకొని తను తెర పైన కనిపిస్తూ ఉండడంతో సమాజంలో చాలామంది రకరకాలుగా అనుకుంటారు.. నిజానికి డైరెక్టర్ లోకేష్ కనకరాజు పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ కూడా చాలా అనుకువగానే ఉంటారని తెలిపింది. తనతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని.. నటనలో తనలో ఇంత క్రియేటివిటీ ఉందని అసలు అనుకోలేదని తొమ్మిది వేరు వేరు లొకేషన్స్ లో మూడు రోజులపాటు వీటిని చిత్రీకరించామని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: