ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచమంతా పాకిపోయింది. ఈ క్రమంలోనే ఎక్కడో జరిగిన ఘటనలు కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో క్షణాల వ్యవధిలో వాలిపోతూన్నాయ్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఎన్నో ఘటనలు ఎంతోమందిని అవాక్కయ్యేలా చేస్తూన్నాయ్. మరీ ముఖ్యంగా అనూహ్యమైన రీతిలో మనుషుల ప్రాణాలు పోతున్న తీరు అందరిలో భయాందోళనకు కారణం అవుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఘటన అయితే మరింత విచిత్రమైనది.


 సాధారణంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఉపవాసం చేయడం చేస్తూ ఉంటారు. కొంతమంది భక్తితో ఉపవాసం చేస్తే ఇంకొంతరు డైటింగ్ పేరుతో ఉపవాసం చేసి తక్కువ ఆహారం తీసుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఉపవాసం చేయడం వల్ల ప్రాణాలు పోతాయి అంటే నమ్ముతారా.. ఉపవాసం చేయడం వల్ల ప్రాణాలు పోవడమేంటి ఇప్పటివరకు ఎన్నోసార్లు ఉపవాసం చేశాము.  నీరసంగా అనిపిస్తుంది. కానీ ప్రాణాలు మాత్రం పోలేదు. ఇలా ఉపవాసం కారణంగా ప్రాణాలు పోతాయి అన్నమాట మొదటిసారి వింటున్నాం అని చెబుతూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఘటన జరిగింది.


 గోవాలో మితిమీరిన ఉపవాసం ఏకంగా ఇద్దరిని బలి తీసుకుంది. సోదరులు జుబేర్ ఖాన్ (29) ఆఫల్ ఖాన్ (27 ) సహా తల్లి రుక్సానా కొంతకాలంగా మితిమీరిన ఉపవాసం చేయడం మొదలుపెట్టారు. రోజుకు కేవలం ఒక ఖర్జూర చొప్పున మాత్రమే ఆహారం తీసుకుంటున్నారు. దీంతో వారి ఆరోగ్యం క్షీణించింది. ఇక ఈ ఉపవాసాల పై విభేదాలు తలెత్తి వేరుగా ఉంటున్న రుక్సానా భర్త బుధవారం వారి ఇంటికి వచ్చి చూడగా.. సోదరులు విగత జీవులుగా కనిపించారు. అయితే తల్లి రుక్సానా స్పృహ కోల్పోయి కనిపించగా.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రస్తుతం వైద్యులు సమక్షంలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: