తేజ సజ్జ హీరోగా అమృత అయ్యార్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే పాన్ ఇండియా మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకొని 200 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఇకపోతే ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు నిర్మించారు. హనుమాన్ మూవీ  పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నిర్మాణ సంస్థకు కూడా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఇకపోతే హనుమాన్ సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ నిర్మాణ సంస్థ తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న మెగా హీరోలలో ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ తో తమ నెక్స్ట్ మూవీ ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సంస్థ వారు సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందబోయే మూవీ తో కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ 1940 వ సంవత్సరంలో జరిగే కథతో రూపొందబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇలా హనుమాన్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యానర్ వారు తమ తదుపరి మూవీ ని కూడా భారీ స్థాయిలో సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే అనేక విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దానితో ఈయన నటించే సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఆటో మెటిక్ గా ఉంటాయి. ఒక వేళ సినిమా కూడా మంచి టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే ఆ మూవీ కి భారీ కలెక్షన్ లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sdt