ఇదిలా ఉంటే ముందే ఎన్టీఆర్ మూవీ ని స్టార్ట్ చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్టు మరో వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కానీ ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ త్వరలోనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డిలే అవుతుందని తెలుస్తుంది.
అయితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన మరో క్రేజీ, షాకింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాని కూడా దర్శ కుడు ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు.ఇటీ వల ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఎన్టీ ఆర్ సినిమా కూడా రెండు భాగాలు గా ఉంటుందని తెలిపారు. ఈ వార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఖుషి గా వున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి