సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా గుర్తింపును సంపాదించుకున్న ప్రియమణి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా హవా నడిపించిన ప్రియమణి.. దాదాపు దశాబ్ద కాలం పాటు అగ్రతారగా కొనసాగింది. అయితే ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరి సరసన జోడి కట్టి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ కన్నడ భాషలో కూడా నటించి అక్కడ అభిమానులను సంపాదించుకుంది. ఇక తర్వాత కాలంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది.


 అయితే ఎన్నో రోజుల తర్వాత ఈటీవీలో ప్రసారమైన ఢీ అనే డాన్స్ షోలో ప్రత్యక్షమైన ప్రియమణి మరోసారి దర్శక నిర్మాతలు చూపును ఆకట్టుకుంది. దీంతో ఇక వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు అటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ప్రియమణి. ఇక ఎన్నో చాలెంజింగ్ రోల్స్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రియమణి నటించిన మైదాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.


 ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో నటించేందుకు ఏదైనా వదులుకోవడానికి తన సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రియమని చెప్పుకొచ్చింది. ఒకవేళ షారుక్ ఖాన్ ఫోన్ చేసి సినిమా చేద్దామంటే ఏదైనా వదులుకొని ఆయన దగ్గరికి వెళ్తాను. ఈ విషయాన్ని మీడియానే ఆయన దగ్గరకు తీసుకువెళ్లాలి అంటూ ప్రియమణి షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే 2023లో జవాన్ సినిమాలో కీలకపాత్రలో నటించిన ప్రియమణి.. గతంలో చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ లోను ఒక సాంగ్ లో షారుక్ తో కలిసి  నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: