గత కొద్ది రోజులుగా వేతనాలు పెంచాలి అంటూ సినీ ఇండస్ట్రీలో ఉండే కార్మికులు బంద్ కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్లన్నీ కూడా బంద్ అయ్యాయి. దీనివల్ల నిర్మాతలు పూర్తిగా గందరగోరంలో పడిపోయారు. అయితే ఈ సమస్యలను పరిష్కరిస్తానంటూ చిరంజీవి ముందుకు వచ్చారని.. చాలామంది నిర్మాతలు చిరంజీవి ఇంటికి వెళ్లి మరి చర్చించారని అయితే రెండు మూడు రోజులలో పరిష్కారం అవుతుందంటూ హామీ ఇచ్చారనే విధంగా చిరంజీవి పై వార్తలు వినిపించాయి..అయితే ఇలాంటి సమయంలో తనపై సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని చిరంజీవి సైతం ఖండిస్తూ ఒక సందేశాన్ని పంపించారు.


చిరంజీవి ఇలా రాసుకుంటూ.. నా దృష్టికి వచ్చిన విషయం.. ఫిలిం ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటూ కొంతమంది మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని.. తాను ఫెడరేషన్ సభ్యులను కలిసి 30% వరకు వేతన పెంపు డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు.. ఈ సందర్భంలో తాను నిజం చెప్పాలనుకుంటున్నాను.. నేను ఫెడరేషన్ కి చెందిన ఎవరిని కూడా కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం కాబట్టి తాను ఏకపక్షంగా ఏలాంటి నిర్ణయాలను తీసుకొని  సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడం లేదంటూ తెలియజేశారు.


 తాను ఎవరిని కలవలేదు ఇది ఇండస్ట్రీ సమస్య అంటు తెలిపారు. వ్యక్తిగతంగా తాను ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదని ఫిలిం ఛాంబర్ దే తుది నిర్ణయం అంటూ మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తన మీద వస్తున్న ప్రకటనలను తాను ఖండిస్తున్నానంటూ  చిరంజీవి తెలియజేశారు. అటు మెగా కుటుంబ సభ్యుల సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలకు కూడా ఈ సమ్మె కారణంగా ఇరకాటంలో పడే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విషయం పైన నిర్మాత లు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు వేతనాలను పెంచలేమంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: