ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మళ్లీ ఒక్కసారి హాట్ టాపిక్ అయ్యారు. గ్యాంగ్‌స్టర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కంగనా, తను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటి అని అందరికీ తెలుసు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనపై ఎదురైన అనుభవాలను బహిరంగంగా బయటపెట్టారు. “బాలీవుడ్‌లో హీరోలకు అసలు మర్యాద తెలియదు” అంటూ నేరుగా దూసుకెళ్లిన కంగనా, ఇండస్ట్రీ మొత్తాన్ని డర్టీగా, పాడైపోయిన వాతావరణంగా పేర్కొన్నారు. “ఇక్కడ బైట వ్యక్తులపై కనీస గౌరవం ఉండదు. నేను అవుట్‌సైడర్‌గా వచ్చినప్పుడు ఎదుర్కొన్న అవమానాలు వేరేలా ఉంటాయి.
 

చిన్న క్యారవాన్ ఇవ్వడం, పక్కన పెట్టేయడం, హార్ష్‌గా ప్రవర్తించడం… ఇవన్నీ సాధారణమైపోయాయి. ఆ అన్యాయాలపై నేను మాట్లాడితే మాత్రం నాపైనే కేసులు వేశారు” అంటూ తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాదు, “నేను ఎక్కువ మంది హీరోలతో పనిచేయలేదు. ఎందుకంటే వాళ్లు మర్యాదగా ప్రవర్తించరనేది నా ప్రధాన ఆందోళన. నేను ఇలా అన్నంత మాత్రాన అది లైంగిక వేధింపుల గురించేం కాదు. సెట్స్‌లో టైం పాటించకపోవడం, సహనటిగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, నన్ను చిన్న చూపు చూడడం లాంటివి వారివద్ద చాలానే చూశాను. కానీ వాటికి వ్యతిరేకంగా ఓపెన్‌గా మాట్లాడటమే వాళ్లకు అహంకారంగా అనిపించింది” అని కంగనా మంటపట్టేలా వ్యాఖ్యానించారు. మీటూ క్యాంపెయిన్ సమయంలో కూడా కంగనా తన వంతు గొంతు వినిపించిన సంగతి తెలిసిందే.


“కాస్టింగ్ కౌచ్ వల్ల ఎంతమంది మహిళా నటులు ఇబ్బంది పడుతున్నారో నేను బహిరంగంగా చెప్పాను. చాలా మంది అమ్మాయిలు మౌనంగా ఓకే అనిపిస్తారు. కానీ నేను మాత్రం వెనక్కి తగ్గలేదు. అందుకే నన్ను టార్గెట్ చేశారు” అంటూ స్పష్టంగా చెప్పేశారు. ఇప్పటికే ఎన్నో సార్లు పరిశ్రమలోని గోప్యమైన విషయాలను ఎత్తి చూపిన కంగనా, ఈసారి కూడా తన ముక్కుసూటితనం వదల్లేదు. పరిశ్రమలో మహిళల స్థితి, హీరోల ప్రవర్తనపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. మొత్తానికి కంగనా రనౌత్ మరోసారి నిరూపించింది – “తనకు భయం లేదు… ముక్కుసూటిగా చెప్పడమే తన అసలు స్టైల్!”

మరింత సమాచారం తెలుసుకోండి: