సినిమా ఇండస్ట్రీ లోకి ఎవరైనా హీరో ఎప్పుడు ఎట్రీ ఇచ్చాడు అనే దాని కంటే కూడా ఎప్పుడూ అదిరిపోయే రేంజ్ కమర్షియల్ హిట్ను కొట్టాడు అనే దాని పైనే ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన ఈమేజ్ కలిగిన హీరోలలో నాగార్జున ఒకరు. నాగార్జున 1967 వ సంవత్సరం విడుదల అయిన సుడి గుండాలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత 1986 వ సంవత్సరం విక్రమ్ అనే మూవీ.తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఇకపోతే నాగార్జున కు మొదటి కమర్షియల్ విజయం మాత్రం ఆఖరి పోరాటం అనే సినిమా ద్వారా దక్కింది. కానీ ఈ సినిమా నాగార్జునకు దక్కడం వెనుక చాలా పెద్ద స్టోరీ నడిచింది. అదేంటో తెలుసుకుందాం.

ఆఖరి పోరాటం సినిమాలో నాగార్జున హీరో గా నటించగా శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. రాఘవేందర్రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అశ్విని దత్ నిర్మించారు. మొదట ఈ సినిమాను నాగార్జునతో కాకుండా చిరంజీవితో చేయాలి అని అనుకున్నారట. అందులో భాగంగా చిరంజీవిని సంప్రదించగా ఆయన కూడా మొదట ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక అంత ఓకే అయ్యే షూటింగ్ మొదలు పెడదాం అనుకునే సమయానికి చిరంజీవి చాలా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ప్రస్తుతం నేను ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో వెంటనే నాగార్జునను సంప్రదించగా ఆయన ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దానితో నాగార్జున హీరో గా శ్రీదేవి హీరోయిన్గా ఈ మూవీ ని ఆఖరి పోరాటం అనే టైటిల్ తో రూపొందించారట. ఈ మూవీ విడుదల అయ్యి అద్భుతమైన కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో నాగార్జునకు మొదటి కమర్షియల్ విజయం దక్కడం మాత్రమే కాకుండా అద్భుతమైన గుర్తింపు కూడా దక్కింది. అలా చిరంజీవి రిజెక్ట్ చేసిన మూవీ తో నాగార్జునకు మొదటి కమర్షియల్ విజయం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: