తాజాగా ఆమె విజయ్ హీరోగా నటిస్తున్న భారీ తమిళ చిత్రమైన ‘జన నాయగన్’ లో హీరోయిన్గా ఎంపిక అయ్యింది. ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. అలాగే, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తోనూ మరో ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని సమాచారం. ఈ రెండు సినిమాలతో పూజా మళ్లీ సౌత్ మార్కెట్లో బలమైన స్థానాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.అదంతా కాకుండా, రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ‘కాంచన-4’ అనే హారర్ ఎంటర్టైనర్లో కూడా పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. లారెన్స్ ‘కాంచన’ సిరీస్ సినిమాలు ఎప్పుడూ సూపర్ హిట్స్ కావడంతో, ఈ సినిమాతో పూజా కెరీర్ మళ్లీ ఊపందుకునే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తాజాగా మరో పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ధనుష్ నెక్స్ట్ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘అమరన్’ ఫేమ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఆర్మీ బ్యాక్డ్రాప్లో సాగే ఈ యాక్షన్ డ్రామాలో పూజా ఏ రకమైన పాత్రలో కనిపించబోతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.పూజా హెగ్డే మరోసారి తన టాలెంట్, గ్లామర్, చార్మ్తో సౌత్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలనే తపనతో ముందుకు సాగుతోంది. ఆమె సౌత్లో తిరిగి స్థిరపడితే, మళ్లీ టాప్ హీరోయిన్గా తన సింహాసనాన్ని తిరిగి పొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఏదేమైనా, వరుస సినిమాలతో తన కెరీర్ మళ్లీ పుంజుకోవడమే కాదు, పాన్-ఇండియా స్టార్గా మళ్లీ వెలుగులు నింపాలని పూజా ఫ్యాన్స్ తీవ్రంగా ఆశిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి