టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటారు. జూన్ 3 ,2023న శర్వానంద్, రక్షిత రెడ్డి అనే అమ్మాయిని జైపూర్ లో చాలా గ్రాండ్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా జన్మించింది. అనంతరం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తన భార్య రక్షిత తో శర్వానంద్ విడిగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని టాక్ కూడా వినిపించింది. ఈ విషయాల పైన క్లారిటీ ఇవ్వకపోవడంతో నిజమే అనుకున్నారు..ఇలాంటి తరుణంలోనే శర్వానంద్ ఒక్క మాటతో ఈ విషయాలకు చెక్ పెట్టారు.


తాజాగా శర్వానంద్ ఇన్ డైరెక్ట్ గానే ఈ విషయం గురించి మాట్లాడారు.. ఇటీవల చాలా స్లిమ్ముగా మారి బక్క చిక్కిన బాడీతో కనిపించిన శర్వానంద్ సిక్స్ ప్యాక్ బాడీతో అందరిని ఆకట్టుకున్నారు. తన లుక్  పైన మాట్లాడుతూ తన విడాకుల గురించి కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను తండ్రి అయ్యాకే ఆరోగ్యం పైన చాలా దృష్టి పెట్టాను, అంతకుముందు ఎక్కువగా వర్క్ అవుట్ చేసేవాడిని కాదు నా కుటుంబం కోసం ఆరోగ్యంగా, చాలా దృఢంగా ఉండాలని డిసైడ్ అయ్యానని తెలిపారు.


2019లో తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత 92 కేజీల వరకు బరువు పెరిగానని చాలా కష్టపడి 22 కేజీల వరకు తగ్గాను అంటూ తెలియజేశారు శర్వానంద్. ముఖ్యంగా తన కుటుంబం కోసమే తాను ఆరోగ్యంగా ఉండాలని చెప్పడంతో శర్వానంద్ విడాకుల వ్యవహారాన్ని కొట్టి పారేసినట్టుగా కనిపిస్తోంది.. చివరిసారిగా 2024 లో మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ని మూటకట్టుకున్నారు. ప్రస్తుతం బైకర్, నారి నారి నడుమ మురారి, భోగి వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు శర్వానంద్. ఈ సినిమాలతోనైనా సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: