సమంత–రాజ్ పెళ్లి జరిగిన నాటి నుంచి ఈ జంట మాత్రమే కాదు, వీళ్లకు సంబంధించి ఉన్న కుటుంబ సభ్యుల సోషల్ మీడియా ప్రొఫైల్స్  కూడా అందరి దృష్టిని గట్టిగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు రాజ్ మాజీ భార్య శ్యామల ప్రొఫైల్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఆమె ఏ చిన్న పోస్టు పెట్టినా, అది గంటల్లోనే వైరల్ అయ్యి వేలాది కామెంట్లు, చర్చలు తెచ్చుకుంటుంది. తన పోస్టులలో ఆమె ఎక్కువగా ప్రేమ, మోసం, నమ్మకం, బాధ లాంటి టాపిక్స్‌నే ప్రస్తావించడంతో, అవి నేరుగా సమంతను లక్ష్యంగా చేసుకుని పెట్టిన కౌంటర్లే అన్న భావన చాలా మంది పొందారు. ఈ అనుమానాలు మరింత బలం పొందడానికి కారణం—సమంత, రాజ్ పెళ్లి జరిగిన రోజే శ్యామల చేసిన ఓ భావోద్వేగ పోస్టు. “ఈ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు… నాకు ప్రేమను చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు” అంటూ ఆమె షేర్ చేసిన సందేశం సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చనీయాంశమైంది.ఇంతలో రాజ్ మాజీ భార్య మాత్రమే కాదు, రాజ్ సోదరి శీతల్ నిడుమోరి ప్రొఫైల్ కూడా బాగా వైరల్ అయ్యింది. పెళ్లి అనంతరం సమంత తన కోడల అన్నట్లుగా శీతల్‌కు “ఐ లవ్ యూ” అని పెట్టిన కామెంట్ వలన ఆమె ఖాతా మీద అభిమానుల దృష్టి మరింతగా పడింది.


ఈ నేపథ్యంలో, శీతల్ తన కుటుంబంతో కలిసి సమంత, రాజ్ ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ—“ప్రేమను పంచుకుంటే ప్రేమ రెట్టింపు అవుతుంది… వీళ్లిద్దరికీ శతమానం భవతి”అంటూ, శతమానం భవతి సినిమాలోని ఒక భావోద్వేగ గీతాన్ని కూడా జత చేసింది. ఈ పోస్ట్‌కి వేగంగా వ్యూస్, లైక్స్, కామెంట్లు రావడంతో అది సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారింది.



దీంతో అనేక మంది ఇలా అభిప్రాయపడుతున్నారు..రాజ్ మాజీ భార్య తన మాజీ కుటుంబంతో దూరంగా ఉండడం, ఆమె భావోద్వేగ పోస్టులు పెట్టడం వంటి అంశాలు చూస్తుంటే, శ్యామల–రాజ్ ఫ్యామిలీ మధ్య ఏదో విభేదం ఉండొచ్చని కొందరు ఊహిస్తున్నారు. అదే కారణంగా సమంతకు అండగా నిలుస్తూ, శీతల్ ఆ ఫోటోకు అలా ప్రేమపూర్వకమైన కామెంట్ పెట్టిందేమో అని సోషల్ మీడియాలో అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సమంత–రాజ్ వివాహం ఒక వైపు భారీ హడావుడి సృష్టిస్తుంటే, మరో వైపు వీళ్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్, కుటుంబ సభ్యుల ప్రతి పోస్టు వరకు ప్రజలు ఆసక్తిగా ఫాలో అవుతున్నారు. ఈ మొత్తం ఘటనల్లో శ్యామల, శీతల్, సమంత—ముగ్గురి ప్రొఫైల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: