తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకించి గుర్తింపు ఉంది. ముఖ్యంగా నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పవచ్చు. అలాగే ఆయన స్థాపించిన విద్యాసంస్థలో కూడా ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపాయి. తాజాగా తన తండ్రి ఆశయాలను మరింత ముందుకు తీసుకు వెళ్లేలా అక్కినేని నాగార్జున ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కృష్ణాజిల్లా గుడివాడలోని ANR కళాశాలో 75వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ వజ్రోత్సవాలలో నాగార్జున అతిధిగా పాల్గొన్నారు.



నాగార్జున తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మల జ్ఞాపకంగా ఆ కాలేజీకి నాగార్జున భారీ విరాళాన్ని గిఫ్ట్ కింద ఇచ్చారు. అయితే ఇది కేవలం ఆయన ఒక్క నిర్ణయమే కాదని తన సోదరుడు వెంకటేష్, సోదరి సుశీల ఇలా అక్కినేని కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలియజేశారు. నాగార్జున మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల క్రితం మా తండ్రి ఈ సంస్థ అభివృద్ధి కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. అది ఆ రోజుల్లో చాలా పెద్దది.. ఆయన వారసత్వంగా కొనసాగించడం అలాగే విద్యాసంస్థను నమ్ముకున్న విద్యార్థులకు అండగా నిలబడడం కూడా మా కుటుంబ బాధ్యత అంటూ తెలిపారు.

అందుకోసం రూ .2 కోట్ల రూపాయల నిధులను  కేవలం ప్రకటనలకు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో అర్హులైన విద్యార్థులకు సైతం అందేలా చూస్తామంటూ తెలియజేశారు. అలాగే ఈ నిధిని సరైన పద్ధతిలో పార్యదర్శకంగానే విద్యార్థులకు అందేలా చేయాలని యాజమాన్యంతో అక్కినేని కుటుంబం కలిసి పని చేస్తుందని తెలియజేశారు. ఆర్థికంగా వెనుకబడి చదువులో రాణించే విద్యార్థులకు ఈ ఆర్థిక సహాయం చాలా ఉపయోగపడుతుందని  చెప్పడంతో అక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా నాగార్జునను ప్రశంసలు కురిపిస్తూ చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. దీంతో అభిమానుల సైతం మీరు నిజజీవితంలో కూడా ఒక కింగ్ అనిపించుకున్నారని ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: