టాలీవుడ్ లో మాస్ హీరోగా పేరు సంపాదించిన రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. తాజాగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా నటిస్తున్న చిత్రం భర్తమహాశయులకు విజ్ఞప్తి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. ప్రముఖ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమా అంచనాలను పెంచేసింది. ఇందులో రవితేజ మళ్ళీ పాత కామెడీ మార్క్ గుర్తుచేసినట్లు కనిపిస్తోంది. అలాగే హీరోయిన్స్ ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి అందంతోనే కాకుండా నటనతో మరింత టీజర్ ని హైలైట్ చేశారు.


సినిమా బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుందని చిత్ర బృందం నమ్మకంగా తెలియజేస్తోంది. ఇటువంటి తరుణంలోనే ఈ సినిమా గురించి ఒక కీలకమైన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. సంక్రాంతికి పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. కానీ రవితేజ , నిర్మాత సుధాకర్ మాత్రం ఈసారి సామాన్య ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తన సినిమాను మరింత చేరువయ్యేలా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సినిమాకి ఎటువంటి రేట్లు పెంపు ఉండదని పాత సాధారణ ధరలకే ఈ సినిమా టికెట్లు లభిస్తాయని తెలియజేశారు.


పండుగ పూట కుటుంబ సమేతంగా థియేటర్ కి వచ్చి మరి ప్రేక్షకులు సినిమా చూడాలనుకునే వారికి ఇది పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంగీతాన్ని బీమ్స్ సిసిరోలియో అందించారు. అలాగే ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ తో పాటు సత్య వంటి కమెడియన్స్ కూడా నటిస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో బడా సినిమాలతో పోటీపడి రవితేజ సక్సెస్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా టికెట్ల సినిమా రేటు పెంచకపోవడం అనేది ఈ సినిమాకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉన్నది. మరి ట్రైలర్ తో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: