చిన్న సినిమాల ఈవెంట్స్ కి ఎంతో కొంత స్టార్ డం ఉన్న హీరో గెస్ట్ గా వస్తేనే ఆ సినిమాకు కాస్త హైప్ వస్తుందన్న విషయం చాలా చిన్న సినిమాల ఈవెంట్స్ కి చూశాము. అంతేకాదు అప్పటి నుండే ఆ సినిమాపై ఆడియన్స్ ఫోకస్ కూడా ఉంటుంది. ఆ హీరో తాలూకు ఫ్యాన్స్ కూడా సినిమాను ఎంతో కొంత సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తారు.'కౌసల్య కృష్ణ మూర్తి' సినిమాకి ఇదే జరగనుంది. సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వచ్చాడు.

తమిళ్ లో 'కణా' సినిమాకు రీమేక్ గా 'శైలజా కృష్ణ మూర్తి' సినిమాని తెరకెక్కించారు. కే. ఎస్.రామారావు ఈ సినిమాకు నిర్మాత. ఈ బ్యానర్ లోనే నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే తన నిర్మాత కోసం ఈ సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మారాడు. అయితే అసలు విషయం చెప్పాలంటే ముందుగా ఈ ఈవెంట్ కి మెగా స్టార్ చిరంజీవి ని చీఫ్ గెస్ట్ గా పిలవాలనుకున్నారట నిర్మాత కే.ఎస్.రామారావు. ఎందుకంటే ఆయనతో చిరుకి మంచి అనుబంధం ఉంది. కే. ఎస్.రామారావు నిర్మాతగా ఇదే బ్యానర్ లో చిరు కొన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. అయితే ప్రస్తుతం చిరు సైరా, అలాగే తన బర్త్ డే పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే తన సినిమాకు హీరో విజయ్ దేవరకొండను అలాగే రాశీ ఖన్నా ను ఈవెంట్ కి గెస్ట్ లుగా ఇన్ వైట్ చేశారు.  

విజయ్ ఇప్పుడు ఏది మాట్లాడినా సెన్సేషనే. ఏ మాత్రం డిఫరెంట్ గా స్పీచ్ ఇచ్చినా వీడియో వైరల్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోల్లో తన కంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తో పాటు భయంకరమైన క్రేజ్ ఉంది. మరి ఈ క్రేజ్ తో ఈ రోజు విజయ్ ఏం మాట్లాడతాడో.. చిన్న సినిమాగా వస్తున్న 'కౌసల్య కృష్ణ మూర్తి' ని తన వెర్షన్ లో ఎలా ప్రమోట్ చేస్తాడో చూడాలి. ఈ నెల 23న సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఇక విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ నిరాశ పరచిన సంగతి తెలిసిందే. అయినా పూరి తన నెక్స్ట్ సినిమాను విజయ్ తో చేస్తుండటం ఆసక్తికరం.



మరింత సమాచారం తెలుసుకోండి: