బాలీవుడ్ బాద్‌షా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గత కొంత కాలంగా సక్సెస్ లు లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రూపొందిన 'జీరో' సినిమా షారుఖ్ ను మరింత కిందకు లాగేసింది. దాంతో తీవ్ర నిరుత్సాహంలో పడిపోయిన షారుఖ్ ఖాన్ ఎట్టకేలకు కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే. బాలీవుడ్ లో  అద్బుతమైన సినిమాలను తెరకెక్కించి ఇటీవలే ప్రపంచ దిగ్గజ దర్శకుల జాబితాలో టాప్ ప్లేస్ ను దక్కించుకున్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సినిమాను చేయబోతున్నాడు. అయితే ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి షారుఖ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైయ్యాయి. 

అందుకు కారణం దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక మహిళ రాజ్ కుమార్ హిరానీ తనను లైంగికంగా వేదించాడంటూ కొన్ని రోజుల క్రితం ఆరోపణలు చేసిన విషయంతో బాలీవుడ్ మీడియాలో  మొదలైంది. ఇక బాలీవుడ్ పెద్దలు ఆ మధ్య మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బహిష్కరించాలనే అనధికారిక నిర్ణయానికి వచ్చారు. అలా చాలా మందిని ఇండస్ట్రీకి దూరం పెట్టారు కూడా. కాని షారుఖ్ మాత్రం మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్దం అవ్వడంతో ఆయన పై కూడా విమర్శలు వస్తున్నాయి. 

పలువురు స్టార్స్ గతంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న టెక్నీషియన్స్ ను తమ సినిమాల నుండి తొలగించారు. కాని షారుఖ్ మాత్రం ఏరి కోరి ఆయన దర్శకత్వంలో సినిమా చేయండం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు షారుఖ్ అభిమానులు మాత్రం హిరానీపై సదరు మహిళ చేసిన ఆరోపణలు నిరాధారం అని నిరూపించలేనివని.. అందుకే ఆయనతో సినిమా చేయడానికి షారుఖ్ సిద్దమవుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ విమర్శలపై షారుఖ్ ఇంకా స్పందించలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: