యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడని మనకందరికీ తెలిసిన విషయమే. కేవలం ఇటీవలే అనగా సాహో సినిమా విడుదలకు ముందు ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టిన ప్రభాస్ కి చాలామంది అతి తక్కువ సమయంలోనే ప్రభాస్ అకౌంట్ ని ఫాలో అవ్వడం జరిగింది. ఈ క్రమంలో సోషల్ మీడియా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోవర్స్ పొందిన సెలబ్రిటీగా రికార్డు సృష్టించాడు. మామూలుగా వ్యక్తిగతంగా అయినా, సినిమాల పరంగా అయినా ఎక్కువ వివాదాల జోలికి కాంట్రవర్సీ ల కు వెళ్లకుండా చాలా వరకు తన పని తాను చూసుకుని  వెళ్లిపోయే వ్యక్తిత్వం ప్రభాస్ ది.


అయితే ఇటీవల తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో సోషల్ మీడియాలో తారాస్థాయిలో ట్రోలింగ్ చేయడంతో దాన్ని ఎఫెక్ట్ ప్రభాస్ కి చాలా గట్టిగా తగిలినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ లుక్ పై అనేక విమర్శలు సోషల్ మీడియాలో రావడం జరిగాయి. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ లుక్స్ అలాగే మేకప్ పై ట్రోల్స్ వెలువడ్డాయి. ఈ విషయంపై ప్రభాస్ కొంత అసంతృప్తికి లోనైట్లు మరియు సీరియస్ కూడా అయినట్లు టాక్.


అందుకే నెక్స్ట్ సినిమాకు సంబందించిన యూనిట్ తో ఇటీవల చర్చలు జరిపాడట. ముఖ్యంగా కాస్ట్యూమర్ అలాగే మేకప్ ఆర్టిస్ట్ తో వర్క్ షాప్ కి ప్రిపేర్ అవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో తన మేకప్ కి సంబంధించి చాలా జాగ్రత్తలు ఇప్పటినుండి తీసుకుంటున్నారట. నెక్స్ట్ చేయబోయే సినిమాలో ఎప్పుడు చూడని ఈ విధంగా ప్రభాస్ ని చూపించాలి అనుకుంటున్నాడట జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ.



మరింత సమాచారం తెలుసుకోండి: