యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా అంటే బాక్సులు బద్దలవ్వల్సిందే. ఆ రేంజ్ లో తారక్ సినిమా ఉంటుంది. త్రివిక్రం దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత మాంచి కమర్షియల్ హిట్టిచ్చింది. ఇప్పుడు తనకు బాగా ఇష్టమైన దర్శకుడు జక్కన్న తో కలిసి ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ తో పాటు మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. భారీ మల్టి స్టారర్ గా జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే చరణ్ కోసం ఎంతమంది డైరెక్టర్స్ క్యూ లో ఉన్నారో తెలీది గాని తారక్ కోసం మాత్రం టాప్ డైరెక్టర్స్ అందరు ఎప్పుడెప్పుడు తన సినిమాకి డేట్స్ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. 

ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తి చేసుకుని ఎప్పుడు వస్తాడా? అని దాదాపు నలుగురైదుగురు టాప్ డైరక్టర్లు ఎన్టీఆర్ తో సినిమా ప్లానింగ్ లో వున్నారు. వీరంతా ఎన్టీఆర్ ఎప్పుడు ఆర్.ఆర్.ఆర్ నుంచి బయటపడతాడా అని చూస్తున్నారు. బన్నీతో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ తన తరువాత సినిమా ఎన్టీఆర్ తోనే చేయాలని ఫిక్స్ అయిపోయినట్లుగా సమాచారం. విజయ్ తో బిజిల్ సినిమా పూర్తి చేసుకుని, ఈ నెలలో విడుదల చేస్తున్న డైరక్టర్ అట్లీ తో కూడా ఎన్టీఆర్ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది. అందుకే అట్లీ తను ప్రస్తుతం చేస్తున్న బిజిల్ సినిమా తరువాత మరే సినిమాను ఓకె చేయలేదు. 

కొరటాల శివ సన్నిహితులకు ఆయన డైరక్షన్ లోనే ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆ సినిమా కూడా లైన్ లోనే వుంది. కేజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగులో చేయబోయే రెండు సినిమాల్లో ఎన్టీఆర్ ప్రాజెక్టు ఒకటి. ఈ టాప్ లైన్ డైరక్టర్లు అందరూ ఎన్టీఆర్ ప్రాజెక్టులను పట్టుకుని ఎదురుచూస్తున్నారు. మరి వీళ్లలో ఎవరిది ముందు స్టార్ట్ అవుతుందో అన్న విషయం 2020 మార్చి కి కానీ పక్కా క్లారిటి వస్తుంది. ఇవన్ని ఒక ఎత్తైతే తారక్ అన్న సొంత బ్యానర్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ లో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జై లవ కుశ తర్వాత తారక్ కళ్యాణ్ రామ్ కి మరో సినిమా చేయడానికి డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలీదు గాని తారక్ మాత్రం ఈ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: