మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాగా 270 కోట్ల భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్న మెగా మూవీ సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న, కొణిదెల నిహారిక ముఖ్య పాత్రలు పోషించారు. ఇక గత 10 రోజుల నుండి ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఊపందుకున్నాయి. ఇక ఈ మెగా సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన న్యూస్ మెగా ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇవ్వబోతోంది. అదే సెన్సార్ రిపోర్ట్. ఈ సెన్సార్ రిపోర్ట్ తో చాలా విషయాలు తెలియనున్నాయని తాజా సమాచారం.

సైరా విడుదలకు ఇంకో 10 రోజులు మాత్రమే ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతోంది. ఒకపక్క నరసింహారెడ్డి కుటుంబీకులు తమకు ఎంతో కొంత డబ్బు అందాలని వివాదాలు చేస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా సెన్సార్ చేసేందుకు చిత్ర బృందం సిద్దమైంది. ప్రస్తుతం ఫైనల్ కాపీకి కరెక్షన్స్  జరుగుతున్నాయని తాజా సమాచారం.

ఇక ఈ సోమవారం సైరాకు సెన్సార్ జరిగే అవకాశం ఉన్నట్టుగా లేటెస్ట్ న్యూస్. ఇక సెన్సార్ అయిన రోజు సైరా ఎంత నిడివి ఉంది, ఎన్ని కట్స్ ఇచ్చారు లాంటి ఇతర విషయాలు బయటికి రానున్నాయి. ఓవర్సీస్ లోనూ భారీ రిలీజ్ ఉన్న నేపథ్యంలో సెన్సార్ త్వరగా పూర్తి చేయకపోతే చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూస్ వచ్చి అనవసరమైన ఇబ్బందులు ఎదురుకోవలసి వస్తుంది. అందుకే కొణిదెల టీమ్ అలాంటి ఇబ్బందులు రాకుండా గత రెండు వారాలుగా డే అండ్ నైట్ పోస్ట్ ప్రొడక్షన్ మీద పూర్తి ఫోకస్ పెట్టారు. ఇక థియేటర్లు కూడా దాదాపు ఫైనల్ అయిపోయాయని ఫ్రెష్ అప్‌డేట్. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: