యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'.అయితే సైరా ప్రొమోషన్స్ లో చరణ్ బిజీగా ఉండగా.. ఈ లోపు రాజమౌళి ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాల చిత్రీకరించారు. ఇక ఇప్పుడు చరణ్ కాంబినేషన్ లో రానున్న కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి రాజమౌళి ప్లాన్ చేశారట. ఇక చరణ్ సరసన అలియా భట్ నటిస్తుంది. వీరి మధ్య వచ్చే లవ్ సీన్స్ చాల బాగుంటాయి అట. చరణ్ రాకతో ఎన్టీఆర్ కి రాజమౌళి విరామం ఇచ్చారు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా ఓ విదేశీ భామను ఫైనల్ చేశాడు రాజమౌళి. అయితే ఆమె గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది.
గతంలో ఇదే పాత్రలో నిత్యా మీనన్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ జక్కన్న చివరికీ హిందీ భామ వైపే మొగ్గు చూపాడు. అయితే ఆ హిందీ హీరోయిన్ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు.
కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా 'బాహుబలి' తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.