ఈ మద్య కాలంలో కొంత మంది సెలబ్రెటీల అత్యుత్సాహం వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్న విషయం ఎన్నో వెలుగులోకి వచ్చాయి.  తాజాగా కేరళ హీరోయిన్ మంజు సవేకర్ కు చేదు అనుభవం ఎదురైంది.  సహనం కోల్పోయినందుకు పోలీసులతో క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. చిన్న తప్పిదానికి చివరకు సారీ చెప్పి వెళ్లింది. హోటల్‌ కార్మికులతో కేరళ నటి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఒక మలయాళ సినిమా నాగర్‌కోవిల్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆ సినిమాలో హీరోయిన్ గా మంజు సవేకర్ నటిస్తున్నారు.


యూనిట్ సభ్యులందరికి కూడా స్థానికంగా ఉన్న ఒక హోటల్ లో బస ఏర్పాటు చేశారు.  షూటింగ్ పూర్తి చేసుకుని హోటల్ రూం కు వెళ్లిన హీరోయిన్ మంజు తన రూం క్లీన్ గా లేకపోవడంతో హోటల్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు సరైన సమాధానం చెప్పక పోవడంతో ఆమెకు మరింత కోపం వచ్చిందట. గట్టిగా తిట్లపురాణం తగిలించుకోవడం..తాను ఒక సెలబ్రెటీ అని తనతో అమర్యాదగా ప్రవర్తిస్తారా అంటూ సిబ్బందిపై విరుచుకు పడిందట.  అది తట్టుకోలేని రూమ్ బాయ్ ఆమెపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి..ఇద్దరికీ సర్ధిచెప్పాలని ప్రయత్నించారట.  కానీ మంజు సవేకర్ సిబ్బంది తనను కించ పరిచి మాట్లాడరని..అభ్యంతరకరంగా చూశారని ఆరోపిస్తుంది. అక్కడికి వచ్చిన పోలీసులు విచారణ జరిపి, హీరోయిన్ మంజు సవేకర్‌ కు, హాటల్ స్టాఫ్ మధ్య గొడవను సర్ది చెప్పి సమస్యను పరిష్కరించారు. చివరకు రూమ్ బాయ్ కి హీరోయిన్ సారీ చెప్పి ఏడుస్తూ వెళ్లిపోయిందని తెలిపారు పోలీసులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: