సాధారణంగా అయితే ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజాశ్రేయస్సు కోసం పోరాడుతూనే ఉండాలి. కానీ నేటి రోజుల్లో మాత్రం ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు అడుగడుగున హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది.  ఏదైనా చిన్న హోదాలో ప్రజాప్రతినిదిగా ఎన్నికయ్యారు అంటే చాలు ఇక వారి కంటే గొప్ప ఎవరూ లేరు అని భావిస్తున్నారు నేటి రోజుల్లో ఎంతో మంది నాయకులు. ఈ క్రమంలోనే దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  ఇక్కడ ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది.  సర్పంచ్ కాస్త సైకో గా మారిపోయాడు.  నాకంటే ఎవరు గొప్ప కాదు అనే అహం అతన్ని ముందుకు నడిపించింది.



 ఈ క్రమంలోనే ఎంతోమందిఫై యజమాయిషీ చలా ఇస్తూనే ఇస్తూనే కాలం గడుపుతూ వస్తున్నాడు.  ఎవరైనా ఎదురు చెబితే దాడులకు పాల్పడటం లాంటివి కూడా చేసేవాడు   కొన్ని కొన్ని సార్లు ఎదురు చెప్పిన వారిపట్ల సైకోలాగా ప్రవర్తించేవాడు. ఇక ఏకంగా ఓ రోజు ప్రభుత్వ అధికారి అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు సర్పంచ్.  సర్పంచ్ పదవి లో ఉన్న సదరు వ్యక్తి ఎంతో హుందాగా నడుచుకోవాల్సి పోయే నీచంగా ప్రవర్తించాడు  ప్రభుత్వ అధికారి పై పెట్రోల్ పోసి నిప్పంటించి సంచలనం సృష్టించాడు సర్పంచ్.ఇటీవలి కాలంలో ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటు ఉండడంతో ఎంతో మంది రైతులు పెట్రోల్ పోసి బెదిరించడం లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక్కడ ప్రభుత్వాధికారి మాత్రం ఏమీ చేయకుండానే ఏకంగా సర్పంచ్ గా సైకోగా మారిపోయి దారుణానికి పాల్పడ్డాడు  ఈ ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది  ఉపాధిహామీ అధికారిపై సర్పంచ్ పెట్రోల్ పోసి నిప్పంటించటం సంచలనంగా మారిపోయింది  కుబీర్ మండలం ఉపాధిహామీ అధికారి రాజుపై పాతశాల్వీ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇక వెంటనే మంటలను అర్పిన స్థానికులు అతనిని బైంసా లోని ఆస్పత్రికి తరలించారు. ఈజీఎస్ గ్రావెల్ పనుల కోసం సంతకం చేయాలి అంటూ సర్పంచ్ కోరగా దీనికి ఉపాధిహామీ అధికారి రాజు నిరాకరించాడు  దీంతో సాయినాథ్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: