వీరందరికి గుర్తింపు కార్డులు ఇచ్చిన అనంతరం, అక్కడ సైన్యం వారిని పరీక్షించి, వారిని ఆయా ప్రాంతాలకు ప్రయాణానికి అనుమతి ఇవ్వనుంది. ఇజ్రాయెల్ ఆరు రోజుల యుద్ధం తరువాత ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. అప్పటి నుండి ఇక్కడ నివసించడానికి వచ్చిన ప్రజలు వాళ్లతో గొడవలు పడుతూనే ఉన్నారు. ఈ ప్రాంతం సైనికుల ఆదీనంలో ఉంది, ఇక్కడ ప్రజలు నివసించకూడదు అని చెప్పిన వారు వినకపోవడంతో సైన్యం గట్టిగానే చెప్పాల్సి వచ్చేది. మరోపక్క పాలస్తీనా మానవహక్కు సంఘాలు ఈ విషయంపై ఇజ్రాయెల్ తో విభేదిస్తూ వచ్చారు.
అయితే మొత్తానికి ఇన్నాళ్లకు ఈ గొడవలు సర్దుమణిగి, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న 2800మంది గాజా స్ట్రిప్ లకు మేలుజరిగింది. అలాగే నమోదు కానీ వ్యక్తులు 1200ల మందికి కూడా ఈ నిర్ణయం మేలు చేసింది. వీరిలో పశ్చిమ బ్యాంకుకు చెందిన వారి బందువులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గుర్తింపు కార్డుల వ్యవస్థను ఎప్పటికప్పుడు అంటే ప్రతి ఏడాది కూడా పునరుద్దరించాలని ఆ దేశం భావిస్తుంది. గతంలో కూడా ఇలా 32 వేలమందిని ఇజ్రాయెల్ అనుమతించింది. దీనిపై పాలస్తీనా అధారిటీ అధికారి మాట్లాడుతూ, నేడు పౌరసత్వ హక్కులు పొందిన 4000 మంది పేర్లు ప్రకటిస్తారు. వారు తమ పాలస్తీనా గుర్తింపుతోపాటుగా వారి నివాస దేశం చిరునామాను కూడా పొందుతారు. దాదాపు 475000 మంది ఇజ్రాయెల్ యూదులు పశ్చిమ బ్యాంకులో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వారిని బహిష్కరించడం అంతర్జాతీయ చట్టం ప్రకారం కుదరనిపని. కానీ పాలస్తీనా తో శాంతి చర్చలకు మాత్రం ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి ఒప్పుకోలేదు.