పశ్చిమ బెంగాల్ పరిస్థితులను కూడా ఇక్కడ మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా సరిహద్దులలో ఉన్న హిందువులను రాష్ట్రంలోకి రానీయడంలేదు. ఇలా చేయడం వలన ఆయా హిందువులు వేరే దేశాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లిన వాళ్లపై మత విద్వేషకులు అరాచకాలు చేస్తున్నారు. ఇలా భారత్ సరిహద్దులలో ఎక్కువగా జరుగుతున్నట్టు నిపుణులు తెలిపారు. ఈ విధంగా ఆయా దేశాలలో ఉన్న హిందువులను బాధించడం ద్వారా కూడా భారత్ ను మానసికంగా దెబ్బ కొట్టడానికే అని వారు అంటున్నారు. అందుకే బంగ్లాదేశ్ లో కూడా మతం పేరిట జరిగిన అరాచకాల పట్ల భారత్ సంయమనంతో వ్యవహరించింది. ఎందుకంటే భారత్ కు తెలుసు ప్రజలు ఇలాంటి పనులకు పూనుకోరు, కేవలం దీనివెనుక దుష్టశక్తులు ఉన్నాయని గమయించగలిగింది.
బంగ్లాదేశ్ లో మైనారిటీల పై అంటే హిందువులు తదితరులపై వివక్ష కొనసాగుతుంది. కానీ ఆ దేశాన్ని విడిచి వచ్చేస్తుంది మాత్రం స్వదేశీయులు మాత్రమే, మైనారిటీలు కాదు. ఇదొక ముందస్తు వ్యూహం. వాళ్ళు శరణార్థులుగా వచ్చి, అక్కడ నివసిస్తున్న వారిని తరిమి కొడుతున్నారు. ఇదంతా రాజకీయనేతల ఓటు బ్యాంకు నాటకాలతో పెద్దఎత్తున జరుగుతున్న హిందూ ధర్మ వివక్ష. దీనిని త్వరగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వదేశీ దేశద్రోహులు వాళ్ళతో జతకట్టడం వలన ఇటీవల ఇలాంటివి బాగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలు దీనిపట్ల సరైన చర్యలకు పూనుకోకపోతే, దేశీయులే తమ ప్రాంతంలో జీవించడానికి పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.